దురాశ పరిణామం: కపటి కథలో దొంగతనం, విశ్వాస భంగం!!!

Thumb Image

నమ్మకం అనేది జీవితంలో అత్యంత పవిత్రమైన బంధం. అది ఒకసారి కుదిరితే, మనుషుల మధ్య దూరాలను తగ్గిస్తుంది; అది గనుక బద్దలైతే, సముద్రాలంత దూరాలు మన మధ్య పెరిగిపోతాయి. ఈ కథలోనూ అలాంటి ఒక విశ్వాసబంధం రాజు వీరవర్మకు, అతని సేవకుడు కపటికి మధ్య ఏర్పడినదే కాదు, అంతిమంగా ద్రోహంతో తలబడినది కూడా. ఇది కేవలం ఒక కథ కాదు, మన జీవితాల్లో తరచూ ఎదురయ్యే ఒక అప్రత్యక్ష ప్రతిబింబం. ఎవరెన్ని పాత్రలు పోషించినా, నిజాయితీ ఒక్కటే మనల్ని మహోన్నతంగా నిలబెడుతుంది. ఇక ఆలస్యం లేకుండా కథలోకి ప్రవేసిద్దాం!

ఒక రాజ్యంలో వీరవర్మ అనే రాజు పరిపాలన చేసేవాడు. అతను ధైర్యవంతుడు, న్యాయవంతుడు, ప్రజలను రక్షించే గొప్ప నాయకుడు. ఒక రోజు, రాజు అడవిలో వేటకు వెళ్లాడు. అక్కడ అతను ఒక దొంగను చూశాడు దాని పేరు కపటి. కపటి ఒక చెట్టు వెనుక దాక్కుని, రాజును చూస్తూ ఉన్నాడు. రాజు అతన్ని పట్టుకుని, "నీవు ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నావు?" అని అడిగాడు.

కపటి తెలివిగా, "మహారాజా! నేను ఒక పేదవాడిని, ఆహారం కోసం ఇక్కడ తిరుగుతున్నాను. నన్ను క్షమించండి," అని అన్నాడు. రాజు దయతో, "నీవు నాతో రాజధానికి రా!! నీకు పని ఇస్తాను," అని అన్నాడు. కపటి రాజుతో వెళ్లాడు, రాజ భవనంలో సేవకుడిగా పని మొదలుపెట్టాడు. రాజు కపటిని నమ్మాడు, అతన్ని స్నేహితుడిగా చూడడం మొదలుపెట్టాడు. "కపటీ, నీవు నా నమ్మకమైన సేవకుడివి," అని రాజు అనేవాడు. కపటి కూడా, "మహారాజా, నీవు నాకు దేవుడివి," అని నటించేవాడు.

కొన్ని రోజులు గడిచాయి. కపటి రాజ భవనంలో పనిచేస్తూ, అక్కడి సంపదను చూశాడు బంగారు నాణేలు, ఆభరణాలు, విలువైన వస్తువులు. అతని మనసులో దురాశ మొదలైంది. "రాజు నన్ను నమ్ముతున్నాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించి, ఈ సంపదను దొంగిలిస్తే నా జీవితం సుఖంగా గడుస్తుంది," అని అనుకున్నాడు. కపటి రాజుతో మరింత సన్నిహితంగా మాట్లాడటం మొదలుపెట్టాడు, అతని విశ్వాసాన్ని పూర్తిగా సంపాదించాడు.

ఒక రోజు, రాజు కపటిని పిలిచి, "నీవు నా స్నేహితుడివి. నా ఖజానా గది తాళం చెవిని నీకు ఇస్తున్నాను. దాన్ని కాపాడు," అని అన్నాడు. కపటి లోలోపల సంతోషపడ్డాడు, "మహారాజా, నీ విశ్వాసాన్ని నేను కాపాడతాను," అని నటించాడు. కానీ అతని మనసులో ద్రోహం ఆలోచన బలపడింది. "ఈ రాత్రే ఖజానాను దొంగిలించి, రాజ్యం నుండి పారిపోతాను," అని నిర్ణయించుకున్నాడు.

ఆ రాత్రి, రాజ భవనంలో అందరూ నిద్రపోతుండగా, కపటి ఖజానా గది వైపు వెళ్లాడు. అతను తాళం చెవిని ఉపయోగించి గదిని తెరిచాడు. లోపల బంగారు నాణేలు, రత్నాలు, విలువైన ఆభరణాలు కనిపించాయి. కపటి ఒక పెద్ద సంచిలో ఆ సంపదను నింపడం మొదలుపెట్టాడు. "ఇదంతా నాదైతే, నేను రాజులా జీవిస్తాను!" అని అనుకున్నాడు. అతను సంచిని నింపి, రహస్యంగా బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

కానీ ఆ సమయంలో, రాజ భవనంలోని ఒక కుక్క ఉండేది, దాని దాని పేరు నమస్తే అది ఆ సమయంలో మేల్కొని ఉంది. నమస్తే ఆ క్షణంలో కపటి ఖజానా గది నుండి సంచితో బయటకు వస్తుండగా చూసింది. అది వెంటనే గట్టిగా అరవడం మొదలుపెట్టింది, "బౌ బౌ! బౌ బౌ!" ఆ శబ్దానికి రాజు మేల్కొన్నాడు. అతను బయటకు వచ్చి, కపటిని సంచితో చూశాడు. "కపటీ! నీవు నన్ను మోసం చేశావా?" అని రాజు కోపంగా అరిచాడు.

కపటి పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ రాజు సైనికులను పిలిచాడు. వారు కపటిని పట్టుకుని, రాజు ముందు నిలబెట్టారు. రాజు బాధపడుతూ, "నేను నిన్ను స్నేహితుడిగా నమ్మాను, కానీ నీవు నా విశ్వాసాన్ని దుర్వినియోగం చేశావు," అని అన్నాడు. కపటి తలవంచుకుని, "మహారాజా, నా దురాశ నన్ను ఇలా చేయించింది," అని అన్నాడు.

రాజు కపటిని శిక్షించాలని నిర్ణయించాడు. "నీవు నా స్నేహానికి ద్రోహంతో సమాధానం ఇచ్చావు. నీకు జైలు శిక్ష విధిస్తున్నాను," అని ఆదేశించాడు. సైనికులు కపటిని జైలుకు తీసుకెళ్లారు. రాజు తన కుక్క నమస్తేను మెచ్చుకుంటూ, "నీవే నా నిజమైన స్నేహితురాలివి," అని అన్నాడు. కపటి జైలులో ఉంటూ తన ద్రోహం గురించి బాధపడ్డాడు, "రాజు స్నేహాన్ని నేను మోసం చేయకుండా ఉంటే, ఈ శిక్ష నాకు రాదు," అని అనుకున్నాడు. ఈ విధంగా, కపటి తన దురాశ వల్ల స్నేహాన్ని కోల్పోయి, శిక్షను అనుభవించాడు.

మనలో ప్రతి ఒక్కరిలోనూ విశ్వాసం, దురాశ మధ్య నిరంతర పోరాటం సాగుతూనే ఉంటుంది. ఒకరి నమ్మకాన్ని గెలుచుకోవడమంటే ఒక రాజ్యాన్ని నిర్మించడం లాంటిది, అదే నమ్మకాన్ని వంచించడమంటే ఆ రాజ్యాన్ని శిధిలం చేయడమే. కపటి చేసిన తప్పుడు ఎంపికలు అతన్ని జైలు గదికి నెట్టేశాయి, కానీ మహారాజు వీరవర్మ చేసిన సరైన నమ్మకం కుక్క 'నమస్తే' రూపంలో తగిన శ్రేయస్సును తెచ్చింది. నిజమైన స్నేహం ఎప్పుడూ మనం ఊహించని రూపంలో కలుసుకుంటూ శ్రేయస్సును కలిగిస్తుంది, మనిషి నిజాయితీతో ఉన్నప్పుడు అతని పక్కనే దేవతలుంటారు. ద్రోహంతో జీవించేపుడు, అతని నీడ కూడా అతన్ని వదిలి వెళ్ళిపోతుంది.