24/03/2025 - 164
రుక్మిణి ఆలయంలో కృష్ణుడి కోసం ఎదురుచూసిన క్షణం ఆమె జీవితంలో ఒక అద్భుత ఘట్టంగా మారింది. కృష్ణుడు ఆమె చేయి పట్టుకుని, తన రథం దగ్గరకు తీసుకెళ్తుండగా, ఆమె గుండెలో ఆనందం, ఆశ కలిసిన భావన నిండిపోయింది. ఆమె కలలు నిజమయ్యాయి, కానీ ఇంకా ఒక పెద్ద సవాలు ఎదురుంది రుక్మి, శిశుపాలుడు ఆమెను అంత సులభంగా వదిలిపెట్టే వాళ్లు కాదు. విదర్భలో ఒక గొప్ప యుద్ధం జరగబోతోంది. కృష్ణుడు రుక్మిణిని తన బంగారు రథంలో ఎక్కించాడు. ఆమె రథంలో కూర్చున్నప్పుడు, ఆమె కళ్లలో ఒక నమ్మకం కనిపించింది. “ప్రభూ, నీవు నన్ను కాపాడతావని నాకు తెలుసు,” అని ఆమె మృదువుగా చెప్పింది. కృష్ణుడు నవ్వుతూ, “రుక్మిణి, నీ నమ్మకం నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక ఎవరూ నిన్ను నా నుంచి దూరం చేయలేరు,” అని చెప్పాడు. ఆయన గుర్రాలకు సైగ చేశాడు—రథం గాలిలా దూసుకెళ్లింది.
READ MORE24/03/2025 - 156
రుక్మిణి రహస్య సందేశం కృష్ణుడి చేతికి చేరిన తర్వాత, ఆయన మనసు విదర్భ వైపు తిరిగింది. ఆమె మాటలు ఆమె ఆశ, ఆమె ధైర్యం ఆయన గుండెను తాకాయి. ద్వారకలో ఆయన రాజ్యం సుఖంగా సాగుతున్నా, రుక్మిణి కోరిక ఆయనను ఒక కొత్త సాహసం వైపు నడిపించింది. ఆయన తన రథాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు విదర్భకు వెళ్లాలని నిర్ణయించాడు.
READ MORE21/03/2025 - 112
రుక్మిణి కలలో కృష్ణుడిని చూసిన తర్వాత ఆమె జీవితం మారిపోయింది. ఆ కల ఆమెకు కేవలం ఊహ కాదు—ఒక ఆశ, ఒక నమ్మకంగా మారింది. ఆమెకు పదహారు సంవత్సరాలు వచ్చేసరికి, కృష్ణుడి గురించి ఆలోచించడం ఆమె గుండెలో ఒక లోతైన భావనగా మారిపోయింది. ఆ కలలో కృష్ణుడు చెప్పిన మాటలు “నీవు నన్ను కలుస్తావు” ఆమె మనసులో ఎప్పుడూ తిరిగాయి. కానీ ఆ కల నిజం కావాలంటే ఏం చేయాలి? ఆ ఆలోచన ఆమెను ఒక గొప్ప నిర్ణయం వైపు నడిపించింది కృష్ణుడికి ఒక రహస్య సందేశం పంపడం.
READ MORE19/03/2025 - 229
రుక్మిణి మనసు కృష్ణుడి ఊహలతో నిండిపోయింది. ఆమెకు పదిహేను సంవత్సరాలు వచ్చేసరికి, కృష్ణుడి గురించి ఆలోచించడం ఆమె రోజువారీ జీవితంలో ఒక భాగమైపోయింది. ఆమె ఆ కథలను వినడం, ఆ ఊహలతో ఆడుకోవడం ఒక సరదాగా మొదలైనా, ఇప్పుడు అది ఆమె గుండెల్లో లోతుగా దిగిపోయింది. ఆ ఊహలు ఒక రోజు కలలుగా మారాయి ఆ కలల్లో కృష్ణుడు ఆమె ముందు కనిపించాడు.
READ MORE27/02/2025 - 192
రుక్మిణి జీవితంలో కృష్ణుడి గురించి వినడం ఒక సరదా ఆటలా మొదలైంది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆమె మనసు ఆ కథల్లో మునిగిపోయింది. ఆమెకు పదమూడు, పద్నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి, కృష్ణుడి గురించి తెలుసుకోవడం ఆమెకు ఒక అలవాటుగా మారింది. ఇప్పుడు ఆ కథలు ఆమె ఊహల్లో రంగులు వేసుకోవడం మొదలైంది.
READ MORE27/02/2025 - 225
రుక్మిణి బాల్యం అందంగా, సంతోషంగా సాగిపోతోంది. విదర్భ రాజ్యంలో ఆమె ఒక అద్భుతమైన రాజకుమారిగా పెరిగింది. ఆమెకు పదేళ్లు, పన్నెండేళ్లు వచ్చేసరికి ఆమె అందం గురించి, తెలివి గురించి దేశమంతా మాట్లాడుకునేవారు. కానీ ఆమె జీవితంలో ఒక కొత్త మలుపు రాబోతోంది. అది కృష్ణుడి గురించి తెలుసుకోవడం.
READ MORE27/02/2025 - 428
విదర్భ రాజ్యంలో భీష్మకుడు అనే రాజు ఉండేవాడు. ఆయన చాలా ధర్మబద్ధంగా, నీతిగా రాజ్యం పాలించేవాడు. ఆయన భార్య పేరు శుద్ధమతి. వీరిద్దరూ చాలా సంతోషంగా జీవించారు, కానీ వారికి సంతానం లేకపోవడంతో కొంచెం బాధగా ఉండేవారు. భీష్మకుడు శ్రీకృష్ణుడి భక్తుడు. ఆయన ఎప్పుడూ కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, ఆయనను ప్రార్థిస్తూ ఉండేవాడు. ఒక రోజు శుద్ధమతి కూడా కృష్ణుడి ఆలయంలో గంటల తరబడి పూజలు చేసి, “మాకు ఒక మంచి సంతానం ఇవ్వు ప్రభూ,” అని వేడుకుంది.
READ MORE22/01/2025 - 130
పుట్టినప్పటినుంచి చచ్చే వరకు అనేక సాదక బాదకాల సంసారంలో మనిషి ఆడుతూ పాడుతూ గడిపేస్తు ఉంటాడు. జీవితంలో ఒక్కో సమయంలో ఒక్కో విద్య మనకు పనికివస్తుంది. అలాగని ఏ విద్యా ఉన్నతమైనది కాదు, ఏ విద్యా అధమం ఐనదీ కాదు. ఏది ఏ సమయంలో ఎలా ఉపయోగపడుతుందో ఎవరికీ తెలీదు.
READ MORE18/01/2025 - 158
చివరికి ఏమైందో తెలుసా???...దుష్యంతుడు సభలో ఉన్నతాసనంలో ఆసీనుడై ఉన్నాడు. శకుంతల తన పుత్రుడైన భరతునితో పాటు సభలో ప్రవేశించింది. తన కుమారునికి ఈయనే నీ తండ్రిగారు అని చూపించి నమస్కరింపజేసి తానుకూడా నమస్కరించింది. అప్పుడు దుశ్యంత మహారాజు ఇలా అంటున్నాడు.
READ MORE18/01/2025 - 120
ఎంతకాలానికీ భర్యకోసం రాని భర్త! ఆ తల్లి కొడుకులు ఏమైయ్యారు??? రాజానికి వెళ్లి సపరివార సమేతంగా వచ్చి తన పట్టమహిషిగా తీసుకువెళతాను అని మాట ఇచ్చి వెళ్ళాడు దుష్యంతుడు. దుష్యంతుడు వెళ్ళిన కొద్ది సేపటికి కణ్వమహర్షి వచ్చాడు. సిగ్గుతో, భయంతో ఉన్న శకుంతల ఆయనకు యథాప్రకారం ఎదురుగా వెళ్ళి నమస్కరించి, చిరునవ్వుతో స్వాగతం పలకలేదు.
READ MORE18/01/2025 - 134
లోకమంతా ప్రేమతో నడుస్తుంది, ఇక ఆ ప్రేమ అనేక రకాలు. యజుర్వేదం సైతం “సోమోయ ఉత్తమం హవిః” అని వచిస్తోంది, అంటే ప్రేమయే సర్వ శ్రేష్టమైన హావిస్సు అని అర్థం. లోకంలో ఎన్నెన్నో ప్రేమకథలు నడుస్తూ ఉంటాయి. రుక్మిణీ కృష్ణులనుంచి నేటి తరం యువత వరకు ప్రేమ ప్రేమ ప్రేమ. ఇది అనుభవేక వేద్యమా అన్నట్లుగా ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే మహాభారతంలో కూడా ఇటువంటి ప్రేమకథ ఒకటి ఉంది.
READ MORE11/01/2025 - 104
అయిదువేల సంవత్సరాల క్రితమే వ్యాసమునీంద్రుడు ఆధునిక కాలాన్ని ఎలా ఊహించాడో చదివితే ఆయన దూరదృష్టి వివేకవంతులకు ఆశ్చర్యం కలిగిస్తుంది, కనుక సావధానంగా చిత్తగించండి.
READ MORE11/01/2025 - 118
బ్రహ్మర్షి విశ్వామిత్రుడు రామాయణంలో చాలా ముఖ్యమయిన పాత్ర నిర్వహిస్తాడు. భారతంలో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి తపోదీక్షలో ఉండగా కనిపిస్తాడు. అదికూడా శకుంతలకథలో ఒక సన్నివేశంలో ఈయన దర్శనం లభిస్తుంది: ప్రస్తుతకథ ఆదిపర్వంలోనిది.
READ MORE07/01/2025 - 158
రాయబారానికి వెళ్ళాడు సంజయుడు. శుష్కప్రియాలతో వెళ్ళి, శూన్యహస్తాలతో తిరిగివచ్చాడు. వస్తూనే ధృతరాష్ట్ర మహారాజును దర్శించి, రాయబారం విఫలమయిందని, విశేషాలన్నీ మరుసటి ఉదయం మహాసభలో కురు, గురు, వృద్ధబాంధవమంత్రి, సామంత, దండనాథులందరూ ఉండగా వివరంగా చెపుతానని స్వగృహానికి వెళ్ళాడు.
READ MORE07/01/2025 - 104
మహా విద్వాంసుడూ, భారత వంశ సామ్రాజ్యానికి ప్రధానమంత్రీ అయిన విదురుడు తన ప్రభువు అవివేకాన్ని వేలెత్తి చూపుతూ చెబుతున్నాడు. ప్రభూ ! ధనవంతుడున్నాడే వాడు హాయిగా సుఖపడుతూ భోగమయ జీవితం గడుపుతూ తృప్తి పడకూడదు. పదిమందికీ పెట్టి, పేద వారికి దాన ధర్మాలు చేస్తూండాలి. దానం చేసేటప్పుడు చిరాకుతో, విసుగుతో చెయ్యకూడదు. సంతోషంతో చేస్తే పుచ్చుకున్నవాడు కూడా ఆనందిస్తాడు. దానివల్ల మన పుణ్యం పెరుగుతుంది. అదే ధనానికి ఫలం.
READ MORE03/01/2025 - 115
పాండవులు జూదంలో ఓడిపోయి, అడవులకు వచ్చారు. వారితో పాటు ఎందరో వేదవిదులు కూడా అనుసరించి రాగా, వీరందరి పోషణ భారం ఎలా నిర్వహించగలనా అని ధర్మరాజు విచారంలో మునిగాడు. అప్పుడు వారి పురోహితుడు ధౌమ్యుడు:'ధర్మనందనా! రాజవంశీయుడు తనను ఆశ్రయించిన వారికి అన్నపానాలు సమకూర్చి వారి యోగక్షేమాలు చూసుకుంటూ ఉండాలి. మీ ప్రాచీనులు అందరూ ఈ ధర్మ నిర్వహణ సాగించారు. తపస్సుతో, యోగశక్తితో వారు తమ ప్రజలకు ఈ రక్షణననందించారు.
READ MORE03/01/2025 - 123
భారతంలో కూడా ఈ భామామణి ఉన్నదా ! అని ఆశ్చర్య పడేవారు లక్షకు పైగా ఉంటారు. కాని లక్ష శ్లోకాల మహాభారతంలో సత్యభామ ఉండేది అయిదారు నిముషాలు. ఆ కొంచెం సేపులోనే ఆవిడ మన మనస్సును పట్టుకుంటుంది, అది మీరే చూడండి.
READ MORE29/12/2024 - 190
ఆదిపర్వంలో ఎన్నెన్నో చిత్రవిచిత్రమైన కథలున్నాయి. అందులో ఒకటి గరుత్మంతుడు తనతల్లి వినతకు దాసీత్వం తప్పించడానికి నాగులకోరికమీద 'అమృత కలశం' తేవడానికి బయదేరుతాడు. దారిలో తన ఆకలితీరేదారి చెప్పమని తండ్రి అయిన కశ్యప ప్రజాపతిని అడిగాడు. ఆయన చెపుతున్నాడు.
READ MORE29/12/2024 - 179
పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజులలో వారికి మార్కండేయ ముని దర్శనభాగ్యం లభించింది. ఆయనకు అర్ఘ్యపాద్యాలిచ్చి పూజించారు. కుశల ప్రశ్నలు సాగినవి. పాండవుల వంటి ధర్మపరులకు కలిగిన క్లేశాలకు ఆయన కొంత సేపు విచారించి, యింతకంటె దుఃఖాల పాలయిన శ్రీరామచంద్రుల కథ, నలదమయంతుల కథ వివరంగా చెప్పి కొంత ఓదార్పు కలిగించాడు. అలా వారికి ఏవేవో పురాతన రాజవంశాల గాథలూ, మహర్షుల విశేషాలూ చెపుతున్నాడు.
READ MORE26/12/2024 - 180
చాలా రోజులక్రితం మాట. అగస్త్యుడనే పేరుగల బ్రహ్మచారి ఉండేవాడు. ఆయన తీవ్ర నిష్ఠతో తపస్సు చేస్తూ సర్వ ప్రాణికోటినీ దయాహృదయంతో చూసే వాడు. ఆయన తపోదీక్ష మహామహులెందరికో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించేది. అలా తపస్సు చేసుకుంటూ అరణ్యాలలో తిరుగుతూండగా వాని పితృ పితామహులు కనిపించి: 'నాయనా, యోగ్యురాలయిన కన్యను వివాహం చేసుకుని నువ్వు పుత్ర సంతానం పొందాలి. లేకపోతే మాకు ఉత్తమ లోకాలు దొరకవు • అన్నారు.
READ MORE18/12/2024 - 222
“మహామునులారా! జరత్కారుడనే మహర్షి పేరు మీరు వినే ఉంటారు" అని సూతుడు కథ మొదలు పెట్టాడు. “జరత్కారుడు బ్రహ్మచర్య నియమాలు విడువకుండా తపోదీక్షతో అరణ్యాలలో తిరుగుతూ బ్రహ్మపదం చేరడానికి ప్రయత్నిస్తున్నాడు. అలా ఆయన తిరిగే రోజులలో ఒకనాడు ఒక అడవిలో ఒక విచిత్రం చూశాడు. క్రింద పెద్దగొయ్యి. దాని ప్రక్కగా ఒకే ఒక్క వేరు ఆధారంగా ఉన్న ఒక రకం చెట్టు. దానిమీద తలక్రిందులుగా వ్రేలాడుతూ తపస్సు చేసే ఋషులు.
READ MORE15/12/2024 - 161
(ఈ కథ అశ్వమేధ పర్వంలో ఉంది. వైశంపాయనునిచే జనమేజయునికి చెప్పబడింది.) ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులూ, మహారథులూ ఎందరో కన్ను మూశారు. పద్దెనిమిది అక్షోహిణుల సేనలో కురుపక్షంలో అశ్వత్థామ కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవులయిదుగురు, కృష్ణుడూ, సాత్యకి మిగిలారు.
READ MORE08/12/2024 - 187
అహంకారం ఎప్పుడు వినాశానికి దారి తీస్తుందనే మహాశక్తిమంతుడైన దంభోద్భవుడు కథ ద్వారా పరశురాముడు చేసిన హితబోధ. శ్రీకృష్ణుని రాయబారంలో చెప్పిన అద్భుత సందేశాన్ని చదవండి.
READ MORE06/12/2024 - 166
పూర్వం భరద్వాజుడనే మహర్షి ఉండేవాడు. ఆయనకు ప్రాణస్నేహితుడు రైభ్యుడు. వారిరువురూ, సూర్యోదయానికి ముందుగానే లేచి కాలకృత్యాలు ముగించి, నదీస్నానం చేసి నిర్మల చిత్తంతో పరబ్రహ్మ ధ్యానం చేసుకుంటూ అడవిలో దొరికే ఫలాలతో జీవయాత్ర సాగించేవారు. అలా ఉండగా వారిలో భరద్వాజునికి యువక్రీతుడనే కుమారుడు కలిగాడు.
READ MORE