లోకమంతా ప్రేమతో నడుస్తుంది, ఇక ఆ ప్రేమ అనేక రకాలు. యజుర్వేదం సైతం “సోమోయ ఉత్తమం హవిః” అని వచిస్తోంది, అంటే ప్రేమయే సర్వ శ్రేష్టమైన హావిస్సు అని అర్థం. లోకంలో ఎన్నెన్నో ప్రేమకథలు నడుస్తూ ఉంటాయి. రుక్మిణీ కృష్ణులనుంచి నేటి తరం యువత వరకు ప్రేమ ప్రేమ ప్రేమ. ఇది అనుభవేక వేద్యమా అన్నట్లుగా ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే మహాభారతంలో కూడా ఇటువంటి ప్రేమకథ ఒకటి ఉంది.
సహజంగా యువతీ యువకుల మధ్య ఏర్పడే ఈ అనురాగం బంధమై ప్రేమగా మారి పరిణామ క్రమంలో వివాహానికి లేదా వియోగానికి దారితీస్తుంది. అయితే ప్రతీ దానికీ ఒక ప్రత్యేకమైన కారణం అయితే లేకుండా పోదు. మహాభారతం లోని ఈ ప్రేమకథకు ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, వివాహమై కొడుకు పుట్టినా తండ్రి కొడుకును భార్యను మీరెవరో నాకు తెలీదు అని చెప్పడం కాస్త రక్తి కట్టే విషయమనే చెప్పాలి. అది వేరేదో కాదు అదే శకుంతల దుష్యంతుల అజ్ఞాత ప్రేమకథ.
శకుంతల విశ్వామిత్రునికి మే జన్మించిన అతిలోక సౌందర్యవతి. కానీ దౌర్భాగ్యం తల్లిదండ్రులే చెట్టుకింద వదిలేసి వెళ్ళిపోయారు. విధి అలా నిర్ణయించింది
మరి. ఆ చెట్టుకింద వదిలేసిన ఆడుబిడ్డను శాకుంతల పక్షులు పోషించసాగాయి. ఒకానొక సమయాన అటుగా వచ్చిన కణ్వ మహర్షి ఆ శిశువును చూసి తన
ఆశ్రమానికి తీసుకువచ్చి సంరక్షింపజేసాడు. శకుంతల యౌవనానికి వచ్చింది. ఆమె అందం ముందు దేవకన్యలు కూడా తలదించుకునేలా ఉంది ఆ రూప లావణ్య
యౌవనవతి శకుంతల.
ఒకనాడు వేటకై ఆ వనానికి దుష్యంత మహారాజు వచ్చాడు. ఒక లేడిని వెంబడిస్తూ అది ఎంతకూ లభించకపోగా ఆ ఆశ్రమ ప్రాంతంలో అది కనుమరుగైంది. ఆశ్రమ ప్రాంతాన్ని చూసిన దుష్యంతుడు కణ్వ మహర్షి ఆశ్రమం అని తెలుసుకొని, పరివారాన్ని అక్కడే ఉంచి ఆశీస్సులు పొందడానికి ఒక్కడే ఆశ్రమానికి విచ్చేసాడు. ఆ సమయంలో కణ్వమహర్షి వనంలోకి వెళ్లి ఉన్నాడు. శకుంతల ఒక్కటే ఆశ్రమంలో ఉంది. రాజును చూసి అతిథి సత్కారాలు చేసి కుశలప్రశ్నలు అడిగింది. రాజు ఆమె రూపానికి ముగ్ధుడై తన పూర్వోత్తరాలు చెప్పి ఆమె పూర్వోత్తరాలు తెలుసుకున్నాడు. క్షత్రియ కన్య అని తెలిసాక మరింత సంబరపడి తన కోరికను వెళ్ళబుచ్చాడు. తనను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని తెలియజేశాడు. ఆమె తన కుమారుణ్ణి రాజ్యానికి వారసునిగా చేయడానికి సమ్మతమైతే తనకి వివాహం సమ్మతమేనని చెప్పింది. ఇద్దరు సమ్మతులై ఒక్కటి అయ్యారు. వారి అనురాగాలు మన్మతరాగాలు అయ్యాయి. ప్రణయ కేళిలో విహరించారు.
తర్వాత దుష్యంతుడు తాను రాజ్యానికి వెళ్లి ససైన్య సమేతంగా వచ్చి పట్టమహిషిగా తీసుకు వెళతాను అని మాట ఇచ్చి వెళ్ళాడు. ఇది శకుంతలా దుష్యంతుల కథలో పూర్వ భాగం. ఇక ఆ తర్వాత దుష్యంతుడు ఏం చేశాడు? శకుంతల ఎవరు జన్మించారు? శకుంతలను నీవెవరో నాకు తెలీదు అని దుష్యంతుడు ఎందుకు అన్నాడు? మరి శకుంతల తర్వాత ఏం చేసింది? ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డది అన్నది తర్వాతి కథ.