పూర్వం భరద్వాజుడనే మహర్షి ఉండేవాడు. ఆయనకు ప్రాణస్నేహితుడు రైభ్యుడు. వారిరువురూ, సూర్యోదయానికి ముందుగానే లేచి కాలకృత్యాలు ముగించి, నదీస్నానం చేసి నిర్మల చిత్తంతో పరబ్రహ్మ ధ్యానం చేసుకుంటూ అడవిలో దొరికే ఫలాలతో జీవయాత్ర సాగించేవారు. అలా ఉండగా వారిలో భరద్వాజునికి యువక్రీతుడనే కుమారుడు కలిగాడు. రైభ్యునికి అర్వావసువు, పరావసువు అని యిద్దరు కుమారులు పుట్టారు, వారు పెరిగి పెద్దవారయ్యారు. భరద్వాజుడు ఎవ్వుడూ ధ్యానసమాధిలో ఉండి కుమారుని విద్యావిషయాలు పట్టించుకోలేదు.
రైభ్యుడు తన కుమారులిద్దరినీ విద్వాంసులుగా తీర్చిదిద్దుకున్నాడు. వారు ఇద్దరూ వివిధ ప్రాంతాలలో పర్యటించి తమ విద్యతో అందరి ప్రశంసలూ పొందుతున్నారు. ఇదిచూసిన యువక్రీతునికి విచారం కలిగి వారివలె తానుకూడా విద్యావంతుడై విశేషఖ్యాతి సంపాదించాలనుకున్నాడు. అదే ఊహతో తపస్సు ప్రారంభించాడు. యువక్రీతుని తపోనిష్టను గ్రహించి దేవేంద్రుడు వచ్చి “స్వామీ! విద్య అనేది గురుముఖతః అధ్యయనం చెయ్యక తప్పదు. అప్పుడుకాని వేద వేదాంగ విజ్ఞానంతో మనస్సు పరిపక్వం కాదు. ఈ ప్రయత్నంమాని ఉత్తమగురువును ఆశ్రయించు ” అన్నాడు.
ఆ మాట యువక్రీతునికి నచ్చలేదు. తపస్సు చేస్తూనే ఉన్నాడు. ఉచిత రీతిని వీనికి ఉపదేశించాలని ఇంద్రుడు ముసలి బాహ్మణవేషంలో వచ్చి గుప్పిడితో యిసుక తీసి నదిలో పోస్తున్నాడు. యవక్రీతుడు నదీస్నానానికి వచ్చి “ఏమిటి ? ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు?” అని అడిగాడు. వృద్ధుడు నవ్వుతూ నదికి అడ్డంగా గోడ కడుతున్నాను ” అన్నాడు.
యువక్రీతుడు నవ్వి; “ఇంతటి నదికి గుప్పెడు గుప్పెడు యిసకతో గోడకట్టటం యీ జీవితంలో సాధ్యమా ?” అన్నాడు. అప్పుడావృద్దుడు “నాయనా ! గురువు సుశ్రూష లేకుండా జ్ఞానార్జన చేయాలి అనుకోవడం కంటే నేను చేసేది అవివేకంకాదు ” అని జవాబిచ్చాడు. “ఓహో సురపతీ ! మీరు ఎలా అయినాసరే నాకు వేదవిద్య అనుగ్రహించి విశేషఖ్యాతి కలిగించాలి” అని ప్రార్థించాడు. ఇంద్రుడు అనుగ్రహించాడు.
యువక్రీతుడు సర్వ వేదశాస్త్ర విద్యా విదుడయ్యాడు. మరుక్షణంలో తపోదీక్షవిడిచి తండ్రిదగ్గరకు వచ్చి జరిగిన విషయాలన్నీ వివరించాడు. అప్పుడు
భరద్వాజుడు“నాయనా ! ఈ విధంగా విద్యసాధించడం వల్ల ఆది అహంకారం కలిగిస్తుంది. అహంకారం ఆత్మనాశనకారణం,నాయనా! ఇంత
చిన్నవయస్సులో శతవత్సరాలు తపస్సుచేసి వరాలు పొందడం మరింత అహంకార హేతువవుతుంది. అయినా ఒక మాట విను, నువ్వు ఎప్పుడూ రైభ్యుని ఆశ్రమ
పరిసరాలకు వెళ్ళబోకు. ఆయన కుమారులతో వైరం తెచ్చుకోకు అన్నాడు. యువక్రీతుడు వివిధ ప్రదేశాలు పర్యటించాడు. అలా ఉండగా ఒకనాడు... అది
వసంతకాలం. అరణ్యమంతా పూలవాసనలతో, ప్రకృతి అంతా పరమరమణీయంగా, ఉల్లాసకరంగా ఉంది.అటువంటి సమయంలో యువక్రీతుడు రైభ్యుని ఆశ్రమ
ప్రాంతానికి వచ్చాడు. ఆశ్రమంలో ఆ మహర్షి కోడలు ఒంటరిగా కనిపించింది. యువక్రీతుని మనను బెదిరింది. ఇంద్రియాలు వశం తప్పిపోగా ఆ యిల్లాలిని
బలాత్కరించి భోగించి వెళ్ళిపోయాడు.
ఆశ్రమానికి వచ్చిన మహాముని ఆ కథవిని తీవ్రక్రోధంతో తన శిరస్సు నుండి రెండు జటలుతీసి హోమంచేసి ఒక సుందరాంగినీ, ఒక రాక్షసునీ సృష్టించాడు.
వారిద్దరూ మహర్షి ఆదేశం ప్రకారం యువక్రీతుని సమీపించారు.
ఆ సుందరీమణి తన కోరచూపుతో చిరునవ్వుతో లావణ్య దీప్త ప్రదర్శనతో యువక్రీతుని లొంగదీసి, వాని చేతిలోని జలపూర్ణ మైన కమండలం తీనుకు
వెళ్ళిపోయింది. అంతటితో అతని శక్తి నశించగా ఆ రాక్షసుడు తన శూలంశో యువక్రీతుని తరిమి పొడవబోయాడు, సరిగ్గా భరద్వాజుని ఆశ్రమద్వారం దగ్గరే
వానిని సంహరించాడు.
అదిచూచి భరద్వాజుడు! “నాయనా ! అనాయాసంగా లభించిన విద్య ఇటువంటి అనర్థాన్ని తెస్తుందని చెప్పినా విన్నావుకావు.” అని గోలున విలపించి, ఆ
తీవ్రవేదనలో రైభ్యుని శపించి, తానుకూడా అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేశాడు. శాపగ్రస్తుడైన రైభ్యుడు ఆయన కుమారుని చేతులలోనే మరణించాడు. అప్పుడు
అర్వావనువు సూర్యుని ఉపాసించి తన తండ్రినీ,భరద్వాజ, యువక్రీతులనూ బ్రతికించాడు.
అనగా, వారు;“నాయనా! ఆయన గురు సుశ్రూషతో వేదవిద్యమ సాధించాడు. కనుక అంతటి శక్తిశాలి అయ్యాడు. అది లేకుండా నువ్వు సాధించావు. ఆ శక్తి నీకు రాదు, విద్య గురుముఖతః నేర్చుకోవాలి నాయనా !”అని పలికి వారువెళ్ళిపోయారు.