“నాయనా దుర్యోధనా దేవలోకానికి అధివతి అయిన దేవేంద్రుని పేరు విన్నావు కదా ఆయన రథాన్ని నడిపే సారథి పేరు మాతలి, ఇంద్రుని మనసు గ్రహించి రథం నడిపించే మాతలికి ముల్లోకాలలోనూ సౌటిరాగల సారథులు లేరు. అటువంటి సేవాధర్మం ఎరిగిన మాతలి శాంత స్వభావంతో, సద్గుణ సంపదతో అందరిచేతనూ ప్రశంసలు పొందినవాడు.
ఆయనకు గుణకేశి అనే ఒక కూతురు ఉంది, గుణకేశి ఎంతో అందగత్తె అంతకంటే గుణవతి, శీలసంపన్నురాలు, విద్యావతి, తల్లి దండ్రుల శిక్షణలో ఆమె వంశ సాంప్రదాయాన్ని, ఆచారవ్యవహారాలనూ చక్కగా అలవరచుకొని పదిమందిలో వినయగుణవతిగా పేరు పొందింది. బాల్యదశ దాటి పదహారేడుల యవ్వనవతి అయింది. అంటే వివాహ యోగ్యమైన వయసులో అడుగు పెట్టింది.
వరునికోసం అన్వేషణ ఆరంభించాడు మాతలి, ఉన్నత వంశంలో పుట్టి, చక్కని అంద చందాలతో గుణవంతురాలు, విద్యావతి అయిన ఆడబిడ్డకు యోగ్యుడై న వరుడు దొరకడం చాలాకష్టం. విద్య ఉంటే వినయం ఉండదు. విద్యావినయాలుంటే రూపం ఉండదు. ఈ మూడూ ఉంటేసంవద ఉండదు. విద్యా వినయ గుణరూపాలున్న వరుడు దొరుకుతాడేమో అని మాతలి దేవలోకం అంతా తిరిగాడు. భూలోకం కూడా గాలించాడు. ప్రయోజనం లేకపోయింది. అయినా ప్రయత్నం విరమించకుండా తిరుగుతూండగా, ఒకనాడు నారదముని కనిపించి, మాతలి బాధ విని ఆయనకూడా తోడుగా బయలుదేరాడు. ఇరువురూ కలిసి పాతాళంలోని వరుణలోకానికి చేరారు. ఆలోకంలోని వింతలూ, విశేషాలూ వివరంగా చెప్పాడు నారదుడు, అన్నీ విని మాతలి ఓ దేవమునీ! నేను దేవతల ప్రభువైన ఇంద్రుని సారథిని కదా! ఈ లోకం రాక్షసులకు నిలయం. వీరితో బాంధవ్యం నాకు కుదరదు, అన్నాడు.
ఆ తర్వాత వారిరువురూ గరుడలోకం చేరుకొని అక్కడకూడా అన్వేషించారు. అక్కడ కూడా వారికి యోగ్యుడైన వరుడు దొరకలేదు. రసాతలానికి వెళ్ళారు. ఆలోకంలోని ప్రజలందరూ భోగమయ భాగ్యాలతో విలాసమయ జీవితం గడుపుతున్నారు. అది మాతలికి రుచించలేదు. అక్కడినుండి నాగలోకానికి చేరుకున్నారు. ఆ లోకానికి రాజధాని భోగవతి. ఆ రాజధాని నగరంలో అన్వేషణ ప్రారంభించారు. నాగవంశ పముఖులందరి గుణగణాలనూ నారదుడు వివరిస్తూ వారిని చూపిస్తున్నాడు. వింటూ వస్తున్న మాతలి కనులు ఒక నవసుందరాంగుని మీద నిలిచాయి. అది గ్రహించి నారదుడు మాతలీ నాగలోకంలో ఐరావత వంశం ప్రఖ్యాతమయింది.
అందులో పెద్దవాడు ఆర్యకుడు. ఆయన కుమారుడు చికురుడు. నువ్వు చూసే యువకుడు సుముఖడు. ఈ సుందర గుణ 'సంవమ్నుడయిన సుముఖుడు చికురుని ప్రియ పుత్రుడు , అని చెప్పాడు. తరువాత “కులపెద్ద ” అయిన ఆర్యకునితో : “నాయనా! ఈయన ఇంద్రసారది మాతలి. ఈయన కుమార్తె గుణకేశి. ఆమె రూపంలోనేకాక గుణసంవదలో కూడా ఎందరికో పాఠాలు నేర్పగలది. ఆ బిడ్డను. మి ఇంటి కోడలుగా పంపాలని. మా సంకల్పం అన్నాడు.
ఆర్యకుడు *దేవఘునీ వినతానందనుడైన గరుత్మంతుడు మానాగజాతిని ఆహారంగా తీసుకుంటాడని మీరెరుగుదురు, మొన్ననే మా చికురుడు ఆయనకు అహారం అయ్యాడు. అప్పుడే చెప్పాడాయన. తరువాయి వంతు సుముఖనిది అని, ఈ విషయం తెలిసీ
ఈ వివాహం జరిపి మీ ఆడబిడ్డను జీవితాంతం దుఃఖసముద్రంలో వదలమంటారా అన్నాడు. అప్పుడు మాతలిని వెంటబెట్టుకొని నారదుడు శ్రీమన్నారాయణుని సమీపించి, చేతులు జోడించి, విషయం వివరించగా ఆయన సుముఖునికి పూర్ణాయుర్దాయం అనుగ్రహించాడు. తిరిగి వచ్చి మాతలి తన బిడ్డను నాగలోకం తీసుకొని వచ్చి సుముఖునితో వివాహం జరిపించాడు. వారు అనురాగంతో ఆనందమయ దాంపత్యం సాగి స్తు న్నారు. ఈ వార్త గరుత్మంతుని చెవిన పడింది.
తీవ్ర క్రో ధంతో నాగలోకం చేరి *చతుర్ధశ భువనాలకూ అధివతి అయిన మహా విష్ణువు భారాన్ని నేను తప్ప ఇతరులు భరించ లేరని తెలియదామీకు అంతటి శ క్తికల నన్ను నామాట వినకుండా ఈ వివాహం జరిపించి మీరు అవమానించారు” అని అహంకార గర్వంతో తన శ క్తి ప్రదర్శనకు ఊపక్రమించ బోతు౦డగా గ్రహించిన మహావిష్ణువు అక్కడకు వచ్చి మందహాసంతో “నాయనా! వినతా నందనా ! నా భారం అంతా మోయగల శక్తిమంతుడివి కదా! ఏదీ, నాచెయ్యి ఒక్కటి నీ వీపుమీద ఉంచు తాను, చూడు," అని గరుత్మంతుని మీద తన చెయ్యి ఉంచాడు. అంతే! ఇంతకాలంగా శ్రీమన్నారాయణుని వాహనంగావున్న గరుత్మంతునికి ఆ చెయ్యి బరువుకి కళ్ళు తిరిగి, కాళ్ళు పట్టుతప్పి, రెక్కలు గజగజలాడి, నోరుఎండి నాలుక పిడచకట్టింది. అప్పుడు మహావిష్ణువు తన చేతితో వెన్నుదున్వి ఆశ్వాసించి, “నాయనా !... గర్వం, అహంకారం, ఎప్పుడూ కొరగానివి. వినయంతో, వరోపకార దృష్టితో జీవించే వారికే ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి ” అన్నాడు. అనంతరం గరుడవాహనం మీదనే ఆయన శ్రీ వైకుంఠం వెళ్ళాడు. “చూశావా, దుర్యోధనా ! గర్వం ఎటువంటి అవదలు తెచ్చిపెడుతుందో! కనుక ఆది విడిచి పెట్టాలి" అని అన్నాడు కణ్వ మహర్షి.
“నాయనా !... గర్వం, అహంకారం, ఎప్పుడూ కొరగానివి. విన యంతో, వరోపకార దృష్టితో జీవించే వారికే ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి ”,