ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులూ, మహారథులూ ఎందరో కన్ను మూశారు. పద్దెనిమిది అక్షోహిణుల సేనలో కురుపక్షంలో అశ్వత్థామ కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవులయిదుగురు, కృష్ణుడూ, సాత్యకి మిగిలారు. ధర్మరాజుకి పట్టాభిషేకం జరిపించారు. అంపశయ్యమీద ఉన్న భీష్మపితామహుడు సర్వధర్మవిషయాలూ 'బోధించి ఉత్తరాయణ పుణ్య కాలం ప్రవేశించగానే యోగమార్గాన దివ్యలోకాలు చేరాడు. జరిగిన సంగ్రామంలో ఆప్తులు, ఆత్మీయులూ అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనస్సుని వికలంచేస్తూనే ఉంది. ఈ మహా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించగా అశ్వమేధం సాగించమని విద్వాంసులు సలహా యిచ్చారు. వారి ఆదేశానుసారం అశ్వమేధయాగం ఆరంభించాడు.
దేశదేశాలనుంచి చక్రవర్తులూ, విద్వాంసులూ ఎందరో వచ్చారు. వివిధ నగరాలనంచి, జనపదాలనుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిలకించడానికి వస్తున్నారు. చూడవచ్చిన వారందరికీ వస్త్రదానంతో పాటు నిర్విరామంగా అన్నదానం కూడా జరిపించాడు. యోగ్యులైన వారికి సువర్ణ, మణి, రత్నదానాలు చేశాడు. అక్కడకు వచ్చినవారిలో సంతృప్తిపడకుండా ఉన్నవాడు ఒకడూ లేడు. అలా సర్వజన సంతృప్తి కలిగించిన అశ్వమేధయాగం చూచిన దేవతలు పూలవాన కురిపించి ధర్మరాజుని అభినందించారు.
అలా ఆనందించే సమయంలో ఆ యాగశాల సమీపానికి ఒక ముంగిస వచ్చింది. వారందరూ ఈ శాలలోకి ముంగిన ఎలా వచ్చిందా? అని ఆశ్చర్యంతో చూస్తున్నారు. అప్పుడా ముంగిస నవ్వుతూ : “దేవతలుకూడా అభినందించే యాగమా యిది” అంది. తెల్లబోయారు అందరూ. దాని శరీరంలో ఒకభాగం బంగారు కాంతులీనుతోంది. రెండవ భాగం మామూలు చర్మంతో ఉంది. 'సక్తుప్రస్థుడి ధర్మ బుద్ధితో పోలిస్తే యీ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం '? అంది.అందరూ తెల్లబోయారు.
దానినిచూస్తూ: 'ఎవరా మహనీయుడు : ఏవిటాయన కథ?’ అన్నారు. అలా వారు ఆతురతతో అడుగగా : 'సావధానంగా వినండి' అని ఇలా చెప్పింది ముంగిస.
ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలాకాలం క్రితం సర్తుప్రస్థుడనే పేరుగల గృహయజమాని ఉండేవాడు. ఆయనకు ఒకే కుమారుడు ఉండేవాడు. ఆ
అబ్బాయికి కూడా వివాహం అయింది. వారు నలుగురూ సర్వ భూతకోటిని దయతోచూస్తూ, కామ క్రోధాలు విడిచి తపస్సు చేసుకుంటున్నారు. కొడుకూ, కోడలూ
ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు. ఎవ్వరికీ హానిచేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికినదాన్ని తిని తృప్తిగా జీవితం గడుపుతున్నారు. పరబ్రహ్మమీదనే
మనస్సునిలిపి జీవితం సాగించడానికే ఆహారం తీసుకునేవారు. ఆ జీవితంకూడా పరమేశ్వరధ్యానానికే అర్పించేవారు. అలా ఉండగా ఒకనాడు: వారు తమ
పరిసర ప్రాంతాలలోని చేలలో తిరిగి, అక్కడ రాలిన ధాన్యపుగింజలు ఏరితెచ్చుకుని, దంచి, పిండిచేసి, వండుకుని వలుగురూ సమంగా పంచుకున్నారు.
తినడానికి సిద్ధమవుతున్నారు. అటువంటి సమయంలో, ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయనకళ్ళులోతుకు పోయాయి. ఎముకలు బయట పడుతున్నాయి. డొక్కలు
మాడి ఉన్నాయి. ఆకలి, ఆకలి అని నీరసంగా అడిగాడు. ఆయనను ఆదరంగా తీసుకునివచ్చి, తన పక్కన కూర్చో పెట్టుకుని ‘ఆర్యా! తమరు కుశలమే కదా! మా
ఆతిథ్యం స్వీకరించి, అనుగ్ర హించండి. ఏ ప్రాణికీ హాని కలుగకుండా, ఏ పాపానికి ఒడిగట్టకుండా మేంతెచ్చుకున్న ధాన్యపుగింజల పిండితో వండిన ఆహారం యిది.
దీనితో మీ ఆకలిబాధ నివారించుకోండి!’ అని గృహయజమాని తనభాగం ఆయనకు వడ్డించాడు. అది ఆరగించి తనకింకా ఆకలిగా ఉంది అన్నాడు. ఆ మాట
వింటూనే ఆయనభార్య తనభాగం యిచ్చింది. ఇంకా ఆ వృద్ధుని ఆకలిబాధ తీరలేదని తెలిసి కొడుకూ, కోడలూ కూడా వారి ఆహారం ఆయనకు పెట్టారు.
అంతా ఆరగించి, ఆయన ఆనందంతో -'నాయనా: మీ అతిథిసత్కారం, అన్నదానం నాకు తృప్తిని కలిగించాయి. నీతోపాటు నీకుటుంబంలోని వారంతా
ఎంతో ఆకలితో బాధ పడుతూ కూడా మీరు తీనబోయే ఆహారం దానంచేసి, పుణ్యం సాధించారు. మీ దానబుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి.
ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడి గడతాడు. అన్నంకోసం ఎన్నో దారుణాలు చేస్తాడు మానవుడు. అటువంటి దశలో మీ
దానబుద్ధి ఎంతగొప్పదో దేవతలుకూడా గ్రహించారు దయగలగుండె కలవారే ఆశకు దూరం అవుతారు. ఈ రెండూవున్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి.ఆకలితో
అలమటించే ప్రాణికి యింత అన్నంపెట్టడంకంటే ఏ దానమూ గొప్పదికాదు. అటువంటి అన్న దానంచేసిన పుణ్యాత్ములు మీరు ' అంటూండగా దేవవిమానం
వచ్చింది. వారందరూ ఆ విమానం ఎక్కి వెళ్ళారు. ఇదంతా వింటూ చూసిననేను వారు వెళ్ళిన అనంతరం ఆ ప్రాంతంలో ఆ అతిథిపాదాలు కడిగినచోట తిరిగాను.
తిరిగినప్రక్క ఆ పాదాలు, కడిగిన నీటితడి తగిలిన నా దేహంలో ఈ భాగం, బంగారు మయమయింది. దానం అంటే అదే.
అనంతరం ఎన్నెన్నో దాన, ధర్మాలుసాగే ప్రదేశాలు తిరిగినా రెండవప్రక్క దేహం యిలానే ఉండిపోయింది. ఇక్కడకూడా అంతే. నవ్వుతూ వెళ్ళిపోయింది
ముంగిన.